తెలంగాణ

టిఆర్‌ఎస్‌వి సెంటిమెంట్ రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసి పంటలకు నీరు అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని టి.పిసిసి ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డికె అరుణ విమర్శించారు. టిఆర్‌ఎస్ నాయకులు ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేస్తూ కాలం గడుపుతున్నారని ఆమె సోమవారం విలేఖరుల సమావేశంలో విమర్శించారు. ప్రాజెక్టుల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని, అవి బయటపడకుండా ఉండేందుకు తమ పార్టీపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో నీటి పారుదల శాఖ మంత్రి టి. హరీష్‌రావు మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆమె విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు సర్వే పనులకు సుమారు 7 కోట్ల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వమే విడుదల చేసిందని, సర్వేలు చేయించి, డిపిఆర్ చేయించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని హరీష్ రావు చెబితే బాగుండేదని అన్నారు.