తెలంగాణ

రెవెన్యూ తదితర శాఖల్లో 39 మందికి పదోన్నతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 20: తెలంగాణ రాష్ట్రంలోని వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులకు ప్రమోషన్ ఇస్తూ డిపార్ట్‌మెంటల్ ప్రమోషన్ కమిటీ నిర్ణయించింది. ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా నేతృత్వంలో ఏర్పాటైన కమిటీ శనివారం సచివాలయంలో సమావేశమైంది. రెవెన్యూ (సిటి) శాఖలో ముగ్గురికి జాయింట్ కమిషనర్లుగా ప్రమోషన్ ఇచ్చారు. కార్మిక శాఖలో ముగ్గురికి డిప్యూటీ కమిషనర్లుగా, ఇదే శాఖలో ఒకరికి జాయింట్ కమిషనర్‌గా ప్రమోషన్ ఇచ్చారు. ఐటిఐలో ఒకరికి ప్రిన్సిపాల్‌గా, వైద్య ఆరోగ్య శాఖలో 31 మందికి సివిల్ సర్జన్స్ స్పెషలిస్టులుగా ప్రమోషన్లు ఇచ్చారు. అజయ్‌మిశ్రాతో పాటు ఈ కమిటీలో జిఎడిలో ముఖ్యకార్యదర్శి (పొలిటికల్) అదర్ సిన్హా కూడా ఉన్నారు.