తెలంగాణ

కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించుతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 26: వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ప్రభుత్వాన్ని గద్దె దించుతామని టి.టిడిపి నేతలు అన్నారు. ఎన్టీఆర్ భవన్‌లో శుక్రవారం గణతంత్ర దినోత్సవం సందర్భంగా టి.టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రమణ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 68 సంవత్సరాలు దాటినా ఇంకా నిరుపేదల జీవితాలు బాగుపడలేదన్నారు. కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యం ఉన్నందు వల్ల పేదలు బాధలు పడుతున్న సమయంలో ఎన్టీఆర్ టిడిపిని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చారని ఆయన తెలిపారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రం అప్పుల పాలయ్యిందని విమర్శించారు. ప్రజా సమస్యలపై పోరాటం చేస్తుంటే అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారని ఆయన విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌కు గుణపాఠం చెప్పి, అధికారాన్ని చేపట్టి పేదలకు సేవలందిస్తామన్నారు. ఇంకా ఈ సమావేశంలో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర్ రెడ్డి, పెద్దిరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు ప్రసంగించారు.