విశాఖపట్నం

ఉత్తరాంధ్ర కాంగ్రెస్ సమావేశాన్ని విజయవంతం చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 10: ఉత్తరాంధ్రలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఈ నెల 19న దివంగత కాంగ్రెస్ సీనియర్ నేత ద్రోణంరాజు సత్యనారాయణ జయంతి సందర్భంగా విశాఖలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశాన్ని విజయవంతం చేయాలని పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ పిలుపునిచ్చారు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఇన్‌ఛార్జి గుంటూరు భారతి ఆధ్వర్యంలో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి సహా కేంద్ర మాజీ మంత్రులు కిల్లి కృపారాణి, ఎం పల్లంరాజు, కనుమూర్తి బాపిరాజు, తదితర కేంద్ర నాయకులు హాజరవుతున్నారన్నారు. రాష్ట్రంలో పార్టీ నిస్తేజంలో ఉందని, ఇది కాంగ్రెస్‌కు కొత్తకాదన్నారు. వందేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పలు సందర్భాల్లో క్లిస్ట పరిస్థితులను ఎదుర్కొందని, అనంతర కాలంలో తిరిగి పుంజుకుని ప్రజల సంక్షేమం కోసం పనిచేసిందన్నారు. అధికార తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటాలు చేయాలన్నారు. కాంగ్రెస్ ఉత్తర నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ గుంటూరు భారతి మాట్లాడుతూ 19న జరిగే కాంగ్రెస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి వార్డుల్లో క్రియాశీలక కార్యకర్తలు తరలిరావాలని కోరారు. సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పి సతీష్‌వర్మ, వుడా మాజీ ఉపాధ్యక్షుడు రాజు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి, కాంగ్రెస్ నాయకులు గుంటూరు వెంకటనర్శింహ మూర్తి తదితరులు పాల్గొన్నారు.