విశాఖపట్నం

ప్రశాంతంగా డీసెట్ ప్రారంభం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 17: ఇంటర్మీడియట్ తరువాత డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో ప్రవేశాలకు సంబంధించి డీసెట్ (డిఇఇసిఇటి)-2016 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. మే 19 వరకూ ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారులు తెలిపారు. తొలిసారిగా పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహిస్తున్న పరీక్షను జిల్లాలో ఏడు కేంద్రాల్లో నిర్వహించారు. తొలిరోజు ఉదయం, మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షకు 28245 మందిని కేటాయించగా, 24058 మంది హాజరయ్యారు. దరఖాస్తులో ఏమైనా పొరపాట్లు నమోదైతే వాటిని సరిచేసేందుకు వెబ్‌సైట్‌లో కంప్లైంట్ బాక్స్‌ను ఏర్పాటు చేశామని, ఇది మే 18 నుంచి 23 వరకూ అభ్యర్థులకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.