విశాఖపట్నం

ఏజెన్సీ ప్రాంతాల్లో తాగునీటిపై నిర్లక్ష్యం వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, డిసెంబర్ 15: విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని మండల్లాలోని ప్రజలకు తాగునీటికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొవాలని రాష్ట్ర గిరిజన సంక్షేమ, ప్రాథమిక ఆరోగ్యశాఖ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. నగరంలోని ఓ హోటల్‌లో శనివారం ఆర్‌డబ్ల్యూ ఎస్ అధికారులతో సమావేశమైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరకు, పాడేరు నియోజకవర్గాల్లో ఉన్న తాగు నీటి సమస్యలపై సమావేశం నిర్వహించారు. గిరిజన గ్రామాల్లో ప్రజలు తాగునీటి కోసం ఎదుర్కోంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చిన మంత్రి తక్షణమే మరమ్మత్తులకు గురైన నీటి ట్యాంక్‌లను బాగుచేసి గిరిజనులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలన్నారు. అదే విధంగా గిరిజనులకు వైద్యపరంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చర్యలు తీసుకొవాలన్నారు.
కరెన్సీ మార్పిడి అంతంత మాత్రమే...
గాజువాక, డిసెంబర్ 15: ఆంధ్రప్రదేశ్ మెడిటెక్ జోన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ సదస్సుకు విచ్చేసిన వివిధ దేశాలకు చెందిన డెలిగేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని మెడిటెక్ జోన్‌లో ఏర్పాటు చేసిన థామస్ కుక్ మనీ ఎక్సేంజ్ బ్యాంక్ సేవలను అంతంత మాత్రమేగానే వినియోగించుకున్నారు. వందలాది మంది విదేశీయ డెలిగేట్స్‌ను దృష్టిలో పెట్టుకుని థామస్ కుక్‌కు సంబంధించి బ్యాంకు అధికారులు అంతర్జాతీయ సదస్సు జరిగిన చోట ప్రత్యేక ఎక్సేంజ్‌ను ఏర్పాటు చేశారు. మూడు రోజులు పాటు మనీ ఎక్సేంజ్ కౌంటర్‌ను కేవలం 26 మంది విదేశీయ డెలిగేట్స్ మాత్రమే వినియోగించుకున్నారని బ్యాంకు ప్రతినిధులు తెలిపారు. అయితే దాదాపు 1200 మంది వరకు మనీ ఎక్సేంజ్ చేస్తారని నిర్వాహకులు తెలిపారు. కానీ కేవలం 26 మంది మాత్రమే కరెన్సీ మార్పిడి చేసుకున్నా. కరెన్నీ మార్పిడి చేసుకున్న విదేశీయ డెలిగేట్స్ నుండి బ్యాంకు అధికారులు పాస్ పోర్టు జెరాక్స్ తీసుకున్నారు. మనీ ఎక్సేంజ్ అనంతరం బ్యాంకు అధికారులు రశీదులను డెలిగేట్స్‌ను అందించారు. అయితే మనీ ఎక్సేంజ్ ద్వారా థామస్ కుక్ బ్యాంక్‌కు ఎంత లాభం వచ్చిందా అన్న విషయాన్ని, ఎంతమేన మనీ ఎక్సేంజ్ అయిందన్న విషయాన్ని బ్యాంకు అధికారుల బయటకు పెట్టలేదు.