తెలంగాణ

జూపార్క్‌లో టెన్త్ విద్యార్థి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: పరీక్షలు ముగిసిన అనంతరం ఆనందంగా గడుపుదామని వచ్చిన టెన్త్ విద్యార్థి నగరంలోని నెహ్రూ జూపార్క్‌లో మంగళవారం మృత్యువాత పడ్డాడు. పురానాపూల్‌కు చెందిన మంజిత్ తన కుటుంబ సభ్యులతో కలిసి జూపార్క్‌కు వచ్చాడు. ఎత్తయిన ప్రాంతంలో నుంచి కిందకు నీరు పడుతున్న దృశ్యాల్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించేందుకు ఈ విద్యార్థి ఓ బండరాయిపైకి ఎక్కి ఫొటోలు తీస్తూ కిందపడ్డాడు. తలకు గాయం కావడంతో ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మంజిత్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. కాగా, జూ అధికారులు వెంటనే స్పందించనందునే మంజిత్ మరణించాడని అతని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.