-
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల వాయిదాను సవాల్ చేస్తూ సుప్రీం కోర
-
గుంటూరు లీగల్: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పదవీకాలం విషయంలో ఆర్డినెన్స్ అంశంపై పల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
క్రైమ్/లీగల్
నంద్యాలటౌన్, నవంబర్ 25: నంద్యాల మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని పలు ప్రాంతాలు, తాలుకా పోలీస్ స్టేషన్ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు, పట్టుచీరెలు, ఎల్ఈడీ టీవీలను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ గోపాలకృష్ణ తెలిపారు.
అమరావతి, నవంబర్ 25: అమరావతి మండల పరిధిలోని పెదమద్దూరు చప్టా వద్ద శనివారం రాత్రి ప్రమాదవశాత్తు ఆటో, మోటారు బైకు ఢీకొన్న దుర్ఘటనలో తురకా రుషి ఆనంద్ (7) మృతిచెందగా, అతని తల్లిదండ్రులు కిరణ్కుమార్, శైలజ తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు అమరావతి 30 పడకల ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యసేవల కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వనపర్తి/పెద్దమందడి, నవంబర్ 25: వనపర్తి జిల్లా పెద్దమందడి మండల పరిధిలోని వెల్టూరు గ్రామ శివారులోగల జెఎం ఫామ్హౌస్లో అక్రమంగా డంప్ చేసిన మద్యం నిల్వలపై పోలీసులు మెరుపుదాడి చేసి మొత్తం 699 లిక్కర్ కాటన్లను స్వాధీనం చేసుకున్నారు.
చంద్రగిరి, నవంబర్ 25: అసలే అక్రమ సంబంధం... ఆపై అనుమానం.. అదికాస్త పెనుభూతమై ప్రాణాలు తీసేలా చేసింది. చేతికందిన కర్రతో ఓ వివాహితపై దాడి చేశాడు. కుప్పకూలిన ఆ మహిళ చనిపోయిన తరువాత మూటగట్టి పాడుబడ్డ బావిలో పడేశాడు. నిందితుడు లొంగిపోవడంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోనికి వచ్చిన సంఘటన చంద్రగరి మండలం మల్లయ్యపల్లిలో జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
మేదరమెట్ల, నవంబర్ 25 : కొరిశపాడు మండలం మేదరమేట్ల గ్రామానికి చెందిన పొదిలి మమత అనే మహిళ సంతానం లేదని పురుగుల మందు సేవించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందింది. వివరాల్లోకి వెళితే గ్రామంలోని బిసి కాలనీకి చెందిన మమతకు వివాహం అయ్యి సంవత్సరాలు గడుస్తున్నా ఇంత వరకు సంతానం కలుగలేదు. ఈ నేపధ్యంలో అత్త మామలు, బంధువుల సూటిపోటీ మాటలతో మనస్థాపం చెందిన మమత ఈ నెల 22న పురుగుల మందు సేవించింది.
డిచ్పల్లి రూరల్, నవంబర్ 25: డిచ్పల్లి మండలం బీబీపూర్తండా సమీపంలో 44వ నెంబర్ జాతీయ రహదారిపై ఆదివారం చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో షేక్ రహ్మాన్(5) అనే బాలుడు దుర్మరణం చెందాడు. హైదరాబాద్ నుండి నిజామాబాద్ వైపు వస్తున్న కారు బలంగా ఢీకొనడంతో చిన్నారి అక్కడికక్కడే చనిపోయాడు. నడిపల్లి గ్రామానికి చెందిన శేక్ రహ్మాన్ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు.
ఉప్పునంతల, నవంబర్ 25: మండలంలోని వెల్టూరు స్టేజి వద్ద అచ్చంపేట, శ్రీశైలం ప్రధాన రహాదారిపై శనివారం అర్దరాత్రి జరిగిన రోడ్డుప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందినట్లు ఎస్ఐ విష్ణు తెలిపారు.
బొండపల్లి,నవంబర్ 24: బొండపల్లి ఎస్సై పూడి వరప్రసాద్ పెద్ద ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. తానునడుపుతున్న వేగ్నాగ్ వాహనంపైకి లారీ రావడంతో తప్పించే క్రమంలో వాహనం బోల్తాపడింది. ఈప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జు అయినప్పటికీ ఎస్సై వరప్రసాద్ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అటు కుటుంబసభ్యులు, ఇటు పోలీస్ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
సిరిసిల్ల, నవంబర్ 24: సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం స్థానిక శాంతినగర్కు చెందిన కళ్యాడపు రాజేందర్(40) విషం తాగి బలవన్మరణం పాలయ్యాడు. వారం రోజుల క్రితం స్థానిక గాంధీనగర్లో నేత కార్మికుడు అప్పుల బాధతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, తాజాగా స్థానిక శాంతినగర్లో అప్పుల బాధతో రాజేందర్ విషం తాగి బలవన్మరణం పొందాడు.
కామారెడ్డి, బిచ్కుంద, నవంబర్ 24: సిలిండర్ పేలి ఇద్దరు మృతి చెందగా 10మంది గాయపడిన సంఘటన కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో శనివారం రాత్రి దాదాపు 9గంటల ప్రాంతంలో జరిగింది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి.