రంగారెడ్డి

అక్రమ రిజిస్ట్రేషన్‌లతో జాగ్రత్త

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూన్ 22: అసైన్డ్భూములు, అక్రమ రిజిస్ట్రేషన్‌లపై రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ కలెక్టర్ ఎంవి రెడ్డి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అసైన్డ్ భూములు బదిలీ కాకుండా చూడాలని, బదిలీ అయినట్లుగా గుర్తిస్తే వెంటనే నోటీసులు జారీ చేయాలని తెలిపారు. లబ్ధిదారుల ఎంపిక ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని కోరారు. వ్యవసాయ సమగ్ర సర్వేకు సంబంధించి డాటాను పరిశీలించి, అప్‌డేట్ చేయాలని తెలిపారు. నూతనంగా నిర్మించనున్న కలెక్టరేట్ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని అన్నారు. కార్యక్రమంలో జెసి ధర్మారెడ్డి, డిఆర్‌ఒ సురేందర్‌రావు, ఆర్డీవోలు హన్మంత్‌రెడ్డి, మధుసూదన్, డిపిఒ సురేశ్‌మోహన్, ఆర్‌అండ్‌బి ఇఇ చందర్ పాల్గొన్నారు.