క్రీడాభూమి

విండీస్ టి-20 జట్టులో క్రిస్ గేల్‌కు స్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కింగ్‌స్టన్ (జమైకా), జూలై 5: హార్డ్ హిట్టర్ క్రిస్ గేల్ ఈ ఆదివారం భారత్‌తో జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌లో ఆడే విండీస్ జట్టుకు ఎంపికయ్యాడు. తన హోం గ్రౌండ్ సబీనా పార్క్‌లో మొదటిసారి టి-20 మ్యాచ్ ఆడే అవకాశం గేల్‌కు లభించనుంది. లెండల్ సిమన్స్ ఇటీవల అఫ్గానిస్తాన్‌తో జరిగిన టి-20 సిరీస్‌లో దారుణంగా విఫలం కావడంతో, అతని స్థానాన్ని గేల్ దక్కించుకున్నాడు. టి-20 కెరీర్‌లో ఇప్పటి వరకూ అతను 35.32 సగటుతో 1,519 పరుగులు చేసిన గేల్ విండీస్ తరఫున చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ని నిరుడు భారత్‌తో జరిగిన టి-20 వరల్డ్ కప్‌లో ఆడాడు. ఈడెన్ గార్డెన్స్‌లో ఇంగ్లాండ్‌పై మ్యాచ్ ఆడిన తర్వాత గేల్‌కు మళ్లీ విండీస్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశం లభించలేదు. కాగా, టెస్టులు, వనే్డల్లో జట్టుకు నాయకత్వం వహిస్తున్న జాసన్ హోల్డర్‌కు విండీస్ సెలక్టర్లు విశ్రాంతినిచ్చాడు. అతని స్థానంలో కార్లొస్ బ్రాత్‌వెయిట్‌కు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు.
భారత్‌తో జరిగే ఏకైక టి-20 మ్యాచ్‌కి ఎంపికైన విండీస్ జట్టు..
కార్లొస్ బ్రాత్‌వెయిట్ (కెప్టెన్), సామ్యూల్ బద్రీ, రాన్స్‌ఫోర్డ్ బీటన్, క్రిస్ గేల్, ఇవిన్ లూయిస్, జాసన్ మహమ్మద్, సునీల్ నారైన్, కీరన్ పొలార్డ్, రోవ్‌మన్ పావెల్, మార్లొస్ శామ్యూల్స్, జెరోమ్ టేలర్, చాడ్విక్ వాల్టన్, కిస్రిక్ విలియమ్స్.