సబ్ ఫీచర్

మహిమాన్వితులు శ్రీ రాఘవేంద్ర తీర్థులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయల వంశజుడైన సదాశివరాయలు ఆస్థాన పండితుడైన తిమ్మన భట్టు, భార్య గోపమ్మ, వీరిద్దరూ పరిస్థితుల ప్రాబల్యంతో తన గురువులు, తంజావూరులో ఉంటున్న నరేంద్ర తీర్థులకు శరణాగతులయ్యారు. శిష్యుని పరిస్థితి తెలుసుకుని ఆ దంపతులను ఆదరించారు. నరేంద్ర తీర్థులు తంజావూరు ప్రభువులతో తనకు గల పలుకుబడి కారణంగా తిమ్మన భట్టుకు ఆస్థానంలో కవిగా కొలువు ఇప్పించారు. అక్కడ ఆ దంపతులకు వెంకటాంబ, గురురాజులు జన్మించారు. పెళ్లీడు రాగానే కుమార్తెకు వివాహం చేసి అత్తవారింటికి పంపించారు. కొడుకును గురుకులంలో చేర్పించారు. ఇక దంపతులిద్దరే మిగిలారు. అందుకని తీర్థయాత్రలకు పయనమయ్యారు.
తిరుమలేశుని దర్శనం కోసం తిరుమల చేరుకున్న తిమ్మన భట్టుకు కలలో శ్రీనివాసుడు సాక్షాత్కరించి ‘ప్రపంచ ఖ్యాతి గడించే పుత్రుని ప్రసాదిస్తున్నాని’ చెప్పి అంతర్హితుడయ్యడు. కల సాకారమైంది. గోపమ్మ నవమాసాలు నిండడంతో బ్రహ్మ తేజంతో వెలుగుతున్న మగ బిడ్డను ప్రసవించింది. వేంకటేశ్వరుని వరప్రసాదంగా భావించి శిశువుకు వేంకటనాధుడని ఆ దంపతులు నామకరణం చేశారు. అల్లారుముద్దుగా పెంచసాగారు.
ప్రహ్లాదునివలె పసితనంలోనే వేంకటనాథుడు శ్రీహరిని హృదయంలో నింపుకున్నాడు. తల్లి తనయునికి హరిభక్తి సామ్రాజ్యాన్ని చవిచూపింది. మూడు సంవత్సరాల ప్రాయానికే వేంకటభట్టును నారాయణుడు అనుగ్రహించాడు. కాని అతనితోపాటే దారిద్య్రమూ పెరుగుతూ వచ్చింది. దాంతో తిమ్మన్న భట్టుకు సంసారం గడవడం గగనకుసుమంగా మారింది.
అదే సమయంలో ద్వైత వేదాంత పీఠాధిపతి శ్రీ విజయేంద్ర తీర్థులు కుంభకోణం వచ్చారు. కుంభకోణం సంస్థానం స్వాగత ఉత్సవాలతోపాటు విందు ఏర్పాటుచేశారు. ఆహ్వానం అందుకుని తిమ్మనభట్టు సకుటుంబంగా అక్కడకు వెళ్లాడు. శ్రీ విజయేంద్రులవారి చూపు బాలుడైన వేంకటనాధునిపై ప్రసరించింది. ఆ బాలునిలో అనిర్వచనీయమైన శక్తి పొంచి ఉందనీ, దైవాంశ ఉన్నదనీ గుర్తించారు. ఆ సందర్భంలో తిమ్మనభట్టు తన గోడును వినిపించి, తనయునికి అక్షరాభ్యాసం జరిపించవల్సిందిగా అర్థించాడు.
శ్రీవిజయేంద్రులు ‘ఓం’కారంతో అక్షరాభ్యాసం జరిపారు. యుక్తవయస్సు రాగానే సరస్వతిని వివాహం చేసుకున్నారు. ఆమె అన్నగారైన లక్ష్మీ నరసింహాచార్యులు గొప్ప పండితులు. వారి వద్ద సకల శాస్త్రాలు అభ్యసించి గొప్ప పండితుడైనా ఆర్థికంగా కుదుటపడలేదు. సరస్వతి కొడుకుకు జన్మనిచ్చింది. లక్ష్మీనారాయణుడని పేరుపెట్టారు. పరిస్థితులను అధిగమించడానికి శ్రీ సుధీంద్ర యతీంద్రులను దర్శించాలని వెళ్లారు. మఠంలో వేంటనాథుని అంతేవాసిగా చేర్చుకుని మరింతగా శాస్త్రాలను పెంపొందింజేశారు. వేంకటనాథునిలో విష్ణ్భుక్తుడైన శంకరునే్న చూసారు. గురువు శిష్యునిపై వాత్సల్యం కురిపించారు. ఇది మిగతా శిష్యులకు అసూయ కలిగించింది. సుధ అను సంస్కృత గ్రంథానికి వేంకటనాధుడు పరిమళ అను వ్యాఖ్యాన్ని రచించారు. దీనిని గురువులే కాదు అక్కడ చేరిన పండితులంతా వేనోళ్ల ప్రశంసించడంతో అసూయపరులైన తోటి అంతేవాసులకు కనువిప్పు కలిగింది. కాలక్రమంలో సుధీంద్ర యతీంద్రులకు వార్థక్యం సమీపించడంతో ఉత్తరాధికారిగా పీఠాన్ని అధిరోహించడానికి గురువాజ్ఞగా సన్యాసం స్వీకరించి వేంకట నాధుడు రాఘవేంద్ర తీర్థులుగా సన్యాసనామం స్వీకరించారు. భర్త సన్యాసం స్వీకరించడంతో సరస్వతి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ప్రేతాత్మగా మారిపోయింది.
శ్రీ రాఘవేంద్ర తీర్థులు కుంభకోణం నుంచి ఆంధ్ర ప్రాంతం, కర్నూలు జిల్లా, మంత్రాలయంలో తుంగభద్రా నదీతీరాన మంత్రాలయ మఠం నిర్మాణం చేశారు. మంత్రసిద్ధులు, గొప్ప పండితులు అయిన యతీంద్రులు సరస్వతి ప్రేతాత్మకు స్వర్గలోక ప్రాప్తిని తన మంత్రశక్తితో లభింపజేశారు.

-ఆర్. పురంధర్