క్రీడాభూమి

మనోళ్లే.. గెలిచారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రెడా (నెదర్లాండ్), జూన్ 24: చాంపియన్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత్ ఖాతాలో మరో గెలుపు చేరింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను శనివారం జరిగిన మ్యాచ్‌లో 4-0తో మట్టికరిపించిన భారత్ సేన ఆదివారం జరిగిన మరో రెండో మ్యాచ్‌లో ఒలింపిక్ చాంపియన్స్ అర్జెంటీనాపై 2-1తో విజయం సాధించింది. ఆట ప్రారంభమైన రెండో క్వార్టర్‌లో భారత్ జట్టులోని హర్మన్‌ప్రీత్ సింగ్ (17వ నిమిషం), పెనాల్టీ కార్నర్‌ను సద్వినియోగం చేసుకుని మన్‌దీప్ సింగ్ (28వ నిమిషంలో) తలో గోల్స్ చేసి జట్టును ముందుకు తీసుకెళ్లారు. ప్రత్యర్థి జట్టులో గొన్‌జాలో పీలట్ 30వ నిమిషంలో ఒక గోల్ చేసినా ఫలితం లేకపోయింది. చివరికి భారత్ హాకీలో ప్రపంచ నెంబర్-2ను ఓడించి 2-1తో విజయాన్ని తన ఖాతాలో నమోదు చేసుకుంది.