అంతర్జాతీయం
మొబైల్ వీడియో చూసి పిల్లల గ్యాంగ్రేప్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
డెహ్రాడూన్, జూలై 17: అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారానికి పాల్పడిన దారుణ సంఘటన ఉత్తరాఖండ్లోని సాహస్పూర్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బాలురు అందరూ 9 నుంచి 14 ఏళ్ల లోపు పిల్లలే. ఈ దారుణానికి పాల్పడే ముందు వారు మొబైల్ ఫోన్లో వీడియో చూసినట్లు తెలుస్తోంది. జూలై 12న జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిల్లలపై కేసు నమోదు చేసిన పోలీసులు జువెనైల్ జస్టిస్ బోర్డ్ చీఫ్ మేజిస్ట్రేట్ భవదీప్ రావత్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. తన ఇంటిముందు ఆడుకుంటున్న బాలికను చాక్లెట్ ఆశచూపి బాలురకు చెందిన ఓ ఇంటికి తీసుకువెళ్లి అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు తెలిపారు. ఆ సమయం పాప తల్లిదండ్రులు కూడా ఇంటివద్ద లేదు. అనంతరం విషయం తెలిసిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. కేసుకు విచారించిన మేజిస్ట్రేట్ ఇలాంటి విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని, పిల్లల చేతికి మొబైల్ ఫోన్లు అందకుండా చూడాల్సిన బాధ్యత వారిదేనని మందలించారు.