సబ్ ఫీచర్

ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాస్తవ్రిహితమైన కర్మలు ధర్మం అనబడతాయి. మన నడవడి, మన చేష్టలు, మన వృత్తి ఇతరులకు ఇబ్బంది కల్గించనవి, సజ్జనులకు హాని కలిగించనివే ధర్మం అన్పించుకుంటాయి. వ్యవస్థాగతంగా వున్న నియమాలు సంఘ నియమాలు, సంస్కృతి నియమాలు ధర్మమార్గాలు అనిపించుకుంటాయి.
స్వాధ్యాయం, బ్రహ్మచర్యం, దానం, యజనం, ఔదార్యం, సారళ్యం, దయ, అహింస, ఇంద్రియ విజయం, క్షమాగుణం, ఆత్మ సంయమనం, శుచిత్వం, సత్సంకల్పత్వం శివకేశవ భాస్కర దేవాదులపట్ల భక్తి- ఇవి మనం అనుష్టించవలసిన ధర్మాలు. వీటిలోనే వృత్తిరీత్యా, కుల రీత్యా కొన్ని మార్పులు శాస్త్రాలలో చెప్పారు. ఉదాహరణకు అందరికీ అహింసయే పరమధర్మం అని చెప్పినా సైనికులకు మాత్రం శత్రుజయం ధర్మం అని చెప్పారు.
ధృతి, క్షమ, దమం, అస్తేయం, శౌచం, ఇంద్రియ నిగ్రహం, హ్రీః (సిగ్గు), విద్య, సత్యం, అక్రోధం- ఈ పది లక్షణాలు కల్గియున్న ధర్మం అని శాస్త్రం చెబుతోంది.
అంటే మానవుడు ఏదైనా పని ప్రారంభిస్తాడు. తనకు సంబంధించినది కానివ్వండి, కుటుంబానికి సంబంధించినది కానివ్వండి, సమాజానికి సంబంధించినది కానివ్వండి- ప్రారంభించేటపుడు ఏ సమస్యలుండవు. కానీ ప్రారంభించిన కొన్ని రోజులకే సమస్యలు ప్రారంభమవుతాయి. కువిమర్శలు వస్తాయి. ఎన్నో అడ్డంకులు కల్గి నిరాశ కల్గుతుంది. కాని ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆత్మబలంతో అకుంఠిత దీక్షతో ధృతి చెడకుండా ముందుకు సాగిపోవాలి. ఇదే ధర్మం.
మనిషి ఏ విషయంలోనైనా, ఏ పనిలోనైనా ఓర్పు కలిగి వుండాలి. క్షమాగుణంతో ఉండాలి. ప్రతిదానికీ, ప్రతివారినీ, ప్రతి విషయాన్నీ క్షమాశక్తితో ఎదుర్కోవాలి, కోపగించుకోకూడదు. ఓర్పు గుణం వున్నవారిని ఏ శక్తులు ఏమీ చేయలేవు. ఇదే ధర్మం.
మనం ఒక పని చేసేటపుడు మన మనస్సు సంపూర్ణంగా ఆవిషయంలోనే లగ్నం కావాలి. ఒక పనిచేస్తూ మరోదానిని గురించి ఆలోచించకూడదు. తనకు తెలియని విషయాలను తాను తెలుసుకొనక, పెద్దలు, పూర్వులు చెప్పినదానిని అంగీకరించక, స్వతంత్ర నిర్ణయం తీసుకొనక, నిస్తేజంగా, నిర్వికారంగా, నిరాశగా, నిర్లిప్తతగా నియమ రహితుడిగా ఉండకూడదుగాక కూడదు. ఇది ధర్మం.
మనిషికి చదువున్నా, సంపదలున్నా, కీర్తి వున్నా, బలం వున్నా, ఇంద్రియ నిగ్రహం లేనివానికి ఏదో ఒకరోజు పతనం తప్పదు. కాబట్టి మనస్సును దాని ఇష్టానికి వదిలేయకుండా మన చెప్పుచేతల్లో ఉంచుకోవాలి. మనస్సును గెలిచినవాడు దేవేంద్రుడినైనా గెలుస్తాడు. మనస్సును తమ చెప్పుచేతల్లో ఎవరుంచుకుంటారో వారిని భూత ప్రేతాలు గాని, దెయ్యాలుగాని, యక్ష కినె్నరలుగానీ, గ్రహాలు, రోగాలు కానీ, కష్టసుఖాలు గానీ, మరణంగానీ వారి వశంలో వుంటాయి. మన మనస్సును, మాటను, దృష్టిని శరీరాన్ని చేతలనూ అదుపుచేయాలి. ఇదే ధర్మం.
మనిషి ప్రతి విషయానికీ సంకోచపడటం, సిగ్గుపడటం, అనుమానపడటం, తనను తాను తక్కువగా భావించడం కూడదు. మనిషి సత్యవ్రతం కల్గివుండాలి. అకారణంగా, అనవసరంగా ఒకరి మెప్పుకోసం, ఒకరిని మెప్పించటం కోసం, తన పనిని సాధించుకోవటం కోసం, తాను ఏవిధంగానైనా ప్రయోజనం పొందటం కోసం, తనవారిని తృప్తి పెట్టడం కోసం అబద్ధాలు చెప్పకూడదు. అబద్ధం అల్పసుఖాన్ని మాత్రమే కల్గిస్తుంది. మరోనాటికి అవమానంపాలు చేస్తుంది. మనిషి విలువను మట్టిపాల్జేస్తుంది. మన శక్తినీ, కీర్తినీ, గొప్పదనాన్నీ అధఃపాతాళానికి తొక్కివేస్తుంది. కాబట్టి సాధ్యమైనంతవరకూ సత్యధర్మాన్ని వదలకూడదు.
మానవునికి ఆహారం ఎంత ముఖ్యమో వివేకం కూడా అంతే ముఖ్యం. వివేకవంతుడు కావాలంటే విద్యావంతుడు కావాలి. శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విన్నంత మాత్రాన వివేకం సిద్ధించదు. విన్న విషయాలను స్వానుభవానికి మళ్లించుకోవాలంటే మనిషికి విద్య కావాలి. ‘విద్యా విహీనః పశుః’ అని ఆర్యోక్తి. మనిషిగా పుట్టి మట్టిబొమ్మగా జీవితం గడపకూడదు. ఎంతటి బంధాలు పెనవేసుకొని వున్నా, స్థితిగతులు ఎంతటి బాధాకరమైవున్నా, భిక్షమెతె్తైనా చదువుకోవాలని ఋషివాక్యం. ఇది ధర్మం.
మనిషికి పగ, హింస, కోపం, ప్రతీకార మనస్తత్వం-ఇవన్నీ మనిషిని పతనం చేస్తాయి. తన అభివృద్ధికి ఆటంకంగా నిలుస్తాయి. తనను కన్నవారికీ, తాను జన్మనిచ్చినవారికీ, తనను నమ్మి బ్రతికేవారికీ అన్యాయం కల్గుతుంది. అకారణంగా సాటి ప్రాణుల్ని హింసించటం, రాళ్ళు కర్రలతో కొట్టడం ధర్మం కాదు. కోపాన్ని జయిస్తే మనుషులను జయించవచ్చు. సమస్యలను అధిగమించవచ్చు. కోపం భవిష్యత్తును, జీవితాన్ని పతనం చేస్తుంది.
అందుకే శ్రీకృష్ణ భగవానుడు గీతలో చెప్పినట్లు ‘యదా యదాహి ధర్మస్య గ్లా నిర్భవతి భారతా! అభ్యుతాదనమ ధర్మస్య తదాత్మానం సృజౌమ్యహమ్’- పాండవులు ధర్మపరాయణులు కాబట్టే శ్రీకృష్ణుడు పాండవ పక్షాన నిల్చి వారికి సహకరించాడు. అధర్మంతోనే తొక్కివేశాడు. అధర్మపరులను అధర్మంతోనే ఎదుర్కొనవచ్చు, తప్పుకాదు. ధర్మపరులను అధర్మంతో దెబ్బతీయకూడదు. ఇది పాపకార్యం. ఋతుధర్మంవల్లనే వర్షాలు కురుస్తున్నాయి. చెట్లు పండ్లు ఫలాలనిస్తున్నాయి. కాలధర్మంవల్లనే మనిషి మరణిస్తున్నాడు. మరలా సంయోగ ధర్మంవల్లనే మళ్లీ జన్మిస్తున్నాడు. కనుక అంతా ధర్మమే. ధర్మ ఆచరణే మానవాళికి మోక్షమార్గం.

-కురువ శ్రీనివాసులు