విశాఖపట్నం

కొండను తవ్వి ఎలుకనూ పట్టలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 8: రాష్ట్రాన్ని కుదిపేసిన విశాఖ భూ కుంభకోణం ప్రభుత్వం నియమించిన ‘సిట్’ నివేదిక కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేనట్టుగా ఉందన్న విమర్శలు చెలరేగుతున్నాయి. అధికార పక్ష ప్రజాప్రతినిధులు, నాయకులను తప్పించి విపక్షాలకు చెందిన నేతలను ఇరికించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతేడాది జూన్‌లో 28న సీనియర్ ఐపీఎస్ అధికారి వినీత్ బ్రిజ్‌లాల్ నేతృత్వంలో విచారణ ప్రారంభించిన సిట్ బృందం తొమ్మిది నేలల కిందట నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వ భూముల రికార్డుల టాంపరింగ్, ప్రభుత్వ భూముల బదలాయింపునకు నిరభ్యంతర సర్ట్ఫికెట్ల జారీ, తప్పుడు నెంబర్లతో భూముల ఆక్రమణ వంటి అంశాలతో పాటు ప్రైవేటు ఫిర్యాదులు కూడా సిట్ పరిశీలించింది. సిట్ దర్యాప్తు కాలంలో 2,875 ఫిర్యాదులు అందాయి. 333 మంది వ్యక్తిగతంగా సిట్ ఎదుట హాజరై తమ ఫిర్యాదులు అందజేశారు. టీడీపీ, బీజేపీ, వైసీపీ, వామపక్షాలు సహా 11 మంది రాజకీయ ప్రతినిధులు సిట్‌ను కలిసి ఫిర్యాదులు అందజేశారు. ఇదే సందర్భంలో అధికార పార్టీ మంత్రి అయ్యన్నపాత్రుడు సహా అప్పటి మిత్రపక్ష బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు టీడీపీ నేతల భూ ఆక్రమణలపై సిట్‌కు ఫిర్యాదు చేసి సంచలనం సృష్టించారు. ఆనందపురం మండలంలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రభుత్వ భూములను ఆక్రమించుకోగా, పెందుర్తి మండలం ముదపాకలో ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి ప్రభుత్వం పట్టాలిచ్చిన భూములను బీనామీ పేరిట కొనుగోలుకు యత్నించారంటూ విష్ణుకుమార్ రాజు సంచలన ఆరోపణలు చేశారు. ఇక మిగిలిన ఎమ్మెల్యేలపై కూడా పలు ఫిర్యాదులు సిట్‌కు అందాయి. దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన సిట్ విచారణలో అన్ని అంశాలు పరిశీలించి నివేదిక సిద్ధం చేసినట్టు ప్రకటించారు. అయతే తొమ్మిది నెలల అనంతరం సిట్ అందించిన నివేదికను మంత్రి మండలి సమావేశంలో తెచ్చి ఆమోదించడం వెనుక టీడీపీ కుట్ర దాగుందంటూ విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇప్పటికైనా విశాఖ భూ కుంభకోణంపై సీబీఐ వంటి స్వతంత్య్ర దర్యాప్తు సంస్థల విచారణ జరపాలన్న డిమాండ్ తెరపైకి వచ్చింది.

నేను కోరితేనే సిట్ ఏర్పాటు
* మంత్రి గంటా
విశాఖపట్నం, నవంబర్ 8: విశాఖ భూ కుంభకోణం విషయంలో తనపై వచ్చిన ఆరోపణలను ఎదుర్కొనేందుకు ఎటువంటి విచారణనైనా జరిపించాలని తానే సీఎం చంద్రబాబును కోరానని మంత్రి గంటా శ్రీనివాసరావు గురువారం నాడిక్కడ స్పష్టం చేశారు. భూ కుంభకోణంపై తనపై వచ్చిన ఆరోపణలు ధైర్యంగా ఎదుర్కొనాలని భావించి దర్యాప్తు కోరుతూ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖను ప్రదర్శించారు. భూకుంభకోణంపై స్వతంత్ర దర్యాప్తు బృందం (సిట్) బృందాన్ని నియమించిన అనంతరం విచారణ నిష్పక్షపాతంగా జరిగిందన్నారు. వేలాది ఫిర్యాదులు స్వీకరించిన సిట్ అధికారులు పలువురిని విచారించారన్నారు. అన్ని అంశాలు సమగ్రంగా పరిశీలించిన అనంతరం ఎవరు బాధ్యులు, ఎవరి ప్రమేయం ఉందన్న అంశాలతో పాటు ఎవరిపై ఎటువంటి చర్యలు తీసుకోవాలనే సూచనలు కూడా సిట్ నివేదికలో పొందుపరచిందన్నారు. ఈ విషయంలో తనపై స్వపక్షంతో పాటు విపక్షాల నుంచి కూడా పెద్ద ఎత్తును విమర్శలు వెల్లువెత్తాయని, సిట్ నివేదికతో అవి పటాపంచలయ్యాయన్నారు.

సిట్ నివేదిక బహిర్గత పరచాలి
* బీజేపీ పక్ష నేత విష్ణుకుమార్ రాజు
విశాఖపట్నం, నవంబర్ 8:సంచలనం సృష్టించిన విశాఖ భూ కుంభకోణంపై రాష్ట్ర ప్రభుత్వం నియమించిన సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) నివేదికను తక్షణమే బహిర్గత పరచాలని శాసనసభలో బీజేపీ పక్ష నేత పీ విష్ణుకుమార్ రాజు విశాఖలో గురువారం డిమాండ్ చేశారు. విశాఖ నగర శివార్లలో జరుగుతున్న భూ కుంభకోణాలు, అక్రమాలు, ఆక్రమణలపై తన డిమాండ్ మేరకే సిట్‌ను నియమించారన్నారు. విచారణకు ఆదేశించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయాన్ని అభినందిస్తున్నానని, అయితే విచారణలో అధికార, ప్రతిపక్ష నేతల పాత్ర ఉందంని తేలిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం నివేదికలో తమకు అనుకూలంగా ఉన్న అంశాలను మాత్రమే బయటపెట్టి తన పార్టీ వారిపై వచ్చిన అనుమానాలను పక్కనపెట్టారని ఆరోపించారు. హైటెక్ పరిపానగా గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రభుత్వ సిట్ నివేదికను బహిర్గత పరచాలని డిమాండ్ చేశారు. సిట్ ఏర్పాటుకు తన ఫిర్యాదులే కీలకమని అటువంటిది సిట్ ఇచ్చిన నివేదికను తనకు కూడా ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సిట్ నివేదికను ప్రభుత్వ వెబ్‌సైట్‌లో పెట్టి, శాసనసభ్యులందరికీ కాపీలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకుల పాత్ర కూడా ఉందన్న విషయాన్ని ధైర్యం చెప్పాలని డిమాండ్ చేశారు.