క్రీడాభూమి
ధోనీ, ధావన్ను తప్పించారెందుకు?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
న్యూఢిల్లీ, డిసెంబర్ 4: దేశవాళీ క్రికెట్ నుంచి సీనియర్ ఆటగాళ్లు మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్ను ఎందుకు తప్పించారని మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ బీసీసీఐని ప్రశ్నించాడు. రానున్న ఆరు నెలల్లో ఇంగ్లాండ్లో వరల్డ్ కప్ జరుగనున్న నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లను ఎందుకు తప్పించారని అనుమానం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్టు సిరీస్ల నుంచి ధావన్ను తప్పించారు. ప్రస్తుతం ధావన్ తన కుటుంబంతో మెల్బోర్న్లో గడుపుతున్నాడు. అదేవిధంగా ధోనీని ఈ ఏడాది నవంబర్ 1న వెస్టిండీస్తో జరిగిన వనే్డ సిరీస్ తర్వాత నుంచి ఇప్పటివరకు టీమిండియాలో చోటుదక్కలేదు. వెస్టిండీస్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ-20ల్లో ధోనీని తప్పించినా ఈనెల 6నుంచి అడెలైడ్లో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్లలో కూడా చోటుకల్పించలేదు. ఇదే విషయాలను ప్రస్తావిస్తూ ఇండియా టుడేతో మాట్లాడుతూ గవాస్కర్ బీసీసీఐని, సెలక్టర్లకు ప్రశ్నల వర్షం గుప్పించాడు.
చిత్రం.. గవాస్కర్