తెలంగాణ

సహనాన్ని పరీక్షించొద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ టౌన్, డిసెంబర్ 12: మజ్లిస్ పార్టీ అండదండలతో ఎన్నికల్లో గెలిచిన టీఆర్‌ఎస్ బీజేపీ పట్ల అసహనంతోవ్యవహరిస్తూ, దాడులకు తెగబడుతోందని, అధికార దర్పంతో నిర్వహిస్తున్న దాడులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆధ్యాత్మిక గురువు స్వామి పరిపూర్ణానంద అన్నారు. బీజేపి అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌తో కలిసి ఆపార్టీ ఎన్నికల కార్యాలయంలోబుధవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు రోజున బీజేపీ రాష్ట్ర నాయకుడు బండి సంజయ్‌కుమార్ ఇంటిపై మజ్లిస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రాళ్ళతో దాడి చేయడాన్ని ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా ఆయన అభివర్ణించారు. ధర్మం పక్షాన దేశం కోసం పనిచేస్తున్న సంజయ్‌లాంటి నాయకుడిపైనే దాడికి దిగితే, బీజేపి కార్యకర్తలు ప్రతిదాడులకు దిగుతారని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని నమ్మే బీజేపీ కార్యకర్తల సహనాన్ని పరీక్షిస్తే, వారికి మిగిలేది అపజయమేనని అన్నారు. మరోసారి దాడులు పునరావృతమైతే, చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల రాజకీయాలుండాలి తప్ప, ఘర్షణ వాతావరణంలో ఉండరాదని, అది ధర్మ విరుద్దమన్నారు. ధర్మబద్దంగా కాకుండా, అధర్మమే పరమావధిగా వ్యవహరిస్తే టీ ఆర్ ఎస్, మజ్లిస్ పార్టీలకు ప్రజాక్షేత్రంలో తిరుగుబాటు తప్పదన్నారు. ఈ విలేఖరుల సమావేశంలోభాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బాస సత్యనారాయణరావు, జిల్లా ఉపాధ్యక్షుడు కొట్టె మురళీకృష్ణ, నాయకులు బేతి మహేందర్‌రెడ్డి, బోయినపల్లి ప్రవీన్‌రావు, రాపర్తి ప్రసాద్, దుబాల శ్రీనివాస్, దుర్గం మారుతి, భాషవేని మల్లేశం, దాసరి రమణారెడ్డి, గాజే రమేశ్, కటకం లోకేశ్, ఎన్నం ప్రకాశ్,తదితరులు పాల్గొన్నారు.