క్రీడాభూమి
టెస్టు సిరీస్లో ఘన విజయంతో వనే్డ సిరీస్పై కనే్నసిన టీమిండియా
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
సిడ్నీ, జనవరి 11: ఆతిధ్య ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్లో 2-1తో అద్భుత విజయాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ నేతృత్వంలోని టీమిండియా ఇపుడు శనివారం నుంచి ప్రారంభం కానున్న మూడు వనే్డ సిరీస్లోనూ మరో విజయాన్ని అందుకునేందుకు సిద్ధమైంది. ఆసిస్లో ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి టెస్టు సిరీస్లో ఘన విజయాన్ని నమోదు చేసిన కోహ్లీ సేన రానున్న వరల్డ్ కప్కు పూర్తి సన్నద్ధతగా ఉన్నామని తెలిపేందుకు శనివారం నుంచి ప్రారంభం కానున్న తొలి వనే్డ ద్వారా ప్రపంచానికి చాటిచెప్పాలని ఉవ్విళ్లూరుతోంది. మహిళలపై టీమిండియా ఆటగాళ్లు కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించిన జట్టు సారధి కోహ్లీ దాని ప్రభావం వనే్డ సిరీస్పై ఎంతమాత్రం లేదని అందుకు తగ్గట్టు జట్టు ఎంపిక జరుగనుందని స్పష్టం చేశాడు. తొలి వనే్డలో చోటు దక్కించుకున్న రోహిత్ శర్మ, శిఖర్ ధావన్తోపాటు బౌలింగ్తో దాడి చేసేందుకు వీలుగా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, ఖలీల్ అహమ్మద్, ఎడమచేతి వాటం స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, కేదార్ జాదవ్ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి. కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ, అంబటి రాయుడు మిడిలార్డర్లో బరిలోకి దిగొచ్చు.