క్రీడాభూమి
కంగారులతో పోరుకు రెఢీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
విశాఖపట్నం (స్పోర్ట్స్), ఫిబ్రవరి 23: ప్రపంచకప్కు ముందు ఆస్ట్రేలియాతో నేటి నుంచి జరిగే టీ20 సిరీస్పై టీమిండియా కనే్నసింది. గతంలో కంగారులను వారి సొంతగడ్డపై ఓడించిన స్వదేశంలో జరిగే ఈ టోర్నీలో గెలుపుపై ధీమాగా ఉంది. విశాఖపట్నం వేదికగా ఏసీఏ, వీడీసీఏ మైదానంలో ఆదివారం జరిగే మొదటి టీ20 మ్యాచ్కి పూర్తిగా సన్నద్ధమైంది. మరోవైపు భార త్ను వారి సొంత గడ్డపె ఓడించి ప్రతీకారం తీర్చుకునేందుకు ఆస్ట్రేలియా అన్ని అస్త్రాలతో సిద్ధమైంది. ఇదిలాఉంటే ప్రపంచకప్ ముం దు జరిగే చివరి సిరీస్ కావడంతో భారత్ దీన్ని ప్రతిషా టత్మకంగా తీసుకుంది. ఇరు జట్లు శనివారం ముమ్మర సాధన చేశాయి. భారత్ జట్టు ఉదయం 9 గంటలకే నెట్ ప్రాక్టీస్ చేయగా, ఆస్ట్రేలియా జట్టు సభ్యులు మధ్యాహ్నం 1.30 గంటలకు స్టేడియానికి చేరుకుని సా యంత్రం వరకూ సాధన చేశారు. ముఖ్యంగా కోహ్లీ, ఎంఎస్ ధోనీ, పంత్, కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశారు.