తెలంగాణ

ఉత్సాహం నింపిన దిగ్విజయ్ సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 12: అంబేద్కర్ 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మంగళవారం నిర్వహించిన సభ విజయవంతమైంది. పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ సభకు తరలి రావడంతో సికింద్రాబాద్‌లోని ఇంపీరియల్ గార్డెన్ క్రిక్కిరిసింది. దీంతో పార్టీ నాయకులే సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఎఐసిసి నాయకుడు, వి.హనుమంతరావు ప్రసంగంలో ఇంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారని అనుకోలేదన్నారు. మధ్యా హ్నం ప్రారంభమైన సభ సాయంత్రం వరకూ కొనసాగినప్పటికీ కార్యకర్తలు ఓపిగ్గా కూర్చున్నారు. గిరిజన నాయకుడు బెల్లయ్య నాయక్ ఎఐసిసి ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, టిపిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమక్షంలో కాం గ్రెస్‌లో చేరా రు. ఆరేపల్లి మోహన్ ఈ సభకు అధ్యక్షత వహించారు.