తెలంగాణ
భయంతోనే టీఆర్ఎస్ దాడులు:రాజాసింగ్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 20 June 2019
హైదరాబాద్: తెలంగాణలో తాము బలపడుతున్నామనే భయంతోనే టీఆర్ఎస్ దాడులకు పాల్పడుతుందని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. పోరాట యోధురాలి విగ్రహం పాడైపోవటంతో మార్చటంలో తప్పేమిటని ప్రశ్నించారు. పదేళ్ల నుంచి రాణీ అవంతిబాయి విగ్రహం అక్కడే ఉందని అన్నారు. తాను రాయితో కొట్టుకోలేదని, లాఠీఛార్జీ ఎందుకు చేస్తారు ఇదిగో పెద్ద రాయి తీసుకోండని ఎత్తానని అన్నారు. కాగా దాడిలో గాయపడిన రాజాసింగ్ను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, రాష్ట్ర నేత లక్ష్మణ్ సింగ్ ఉన్నారు. రాజాసింగ్పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు మురళీధర్ రావు అన్నారు. దీనిపై జాతీయస్థాయిలో చర్చించే అంశంగా తాము భావిస్తున్నట్లు తెలిపారు.