క్రీడాభూమి
భారత్- ఇంగ్లాండ్ క్రికెట్ సిరీస్ షెడ్యూల్ విడుదల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Friday, 15 July 2016
దిల్లీ: భారత్ పర్యటనలో ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు నవంబర్ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి మధ్య ఐదు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్లు ఆడనుంది. ఈ సిరీస్కు సంబంధించిన షెడ్యూల్ను బీసీసీఐ శుక్రవారం విడుదల చేసింది. భారత్ - ఇంగ్లాండ్ సిరీస్లో మొదటి టెస్టు నవంబర్ 9న రాజ్కోట్లో ప్రారంభం కానుంది. చివరి టెస్టు డిసెంబర్ 20న ముగియనుండగా, జనవరి 15న తొలి వన్డే మ్యాచ్ పుణె వేదికగా జరగాల్సి ఉంది. ఈ సిరీస్ కంటే ముందు సెప్టెంబర్-అక్టోబర్ మధ్య భారత్ పర్యటనకు రానున్న న్యూజిలాండ్తో టీమిండియాతో 3 టెస్టులు, 5 వన్డేల్లో తలపడుతుంది.