తెలంగాణ
ఎంత ఘాటు ప్రేమయో!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
హైదరాబాద్/శంషాబాద్, డిసెంబర్ 25: ఇంజనీర్ చదువుతోన్న ఓ యువతి తన బాయ్ఫ్రెండ్కోసం దొంగతనాలకు పాల్పడుతోంది. 15 తులాల బంగారు ఆభరణాలు తస్కరించిన కేసులో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించిన పోలీసులు అవాక్కయ్యారు. హైదరాబాద్ మలక్పేటకు చెందిన జి.సాయి కిరణ్మయి (19)పై నాలుగు దొంగతనం కేసులు నమోదయ్యాయి. కొన్నిరోజుల క్రితం కిరణ్మయి ఓ ఫేస్బుక్ పేజీని క్రియేట్ చేసింది. అనేక మంది మహిళలతో పరిచయమై స్నేహం కుదుర్చుకుంది. శుభకార్యాలు, మామూలు వేళల్లో వారి ఇళ్లకు వెళ్తూ ఉండేది. తన స్నేహితుల కుటుంబాలతో కూడా కలివిడిగా తిరిగేది. వారి ఇళ్లకు వెళ్లి, అవకాశం చిక్కినప్పుడు బంగారు ఆభరణాలతోపాటు నగదును దొంగిలిస్తూ ఉండేది. ఇదిలావుండగా నవంబర్ 12న కిరణ్మయి స్నేహితురాలు దీపిక తన ఇంట్లో 15 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి కిరణ్మయిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు విచారించగా, ‘నా బాయ్ఫ్రెండ్ యశ్వంత్ జిమ్ ఇన్స్ట్రక్టర్. అతను డబ్బుకోసం ఇబ్బందులు పడుతున్నాడు. అందుకే చోరీలకు పాల్పడుతున్నాను’ అని చెప్పింది. కిరణ్మయితోపాటు ఆమె బాయ్ఫ్రెండ్ యశ్వంత్ నాయుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా నిందితులిద్దరిని జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు.