ఎనీ టైం నో మనీ
Published Friday, 25 August 2017కరీంనగర్ టౌన్: నగరానికి చెందిన రఘునందన్ అనారోగ్యంతో బాధపడుతుండగా, చికిత్స కోసం అవసరమైన డబ్బును ఎటిఎంలో నుంచి తీసుకునేందుకు వెళ్ళాడు. మంకమ్మతోటలోని ఓ సెంటర్కు వెళ్ళగా నగదు లేదంటూ బోర్డు దర్శనమివ్వటంతో వెనుదిరిగాడు. అక్కడినుంచి రెండో పట్టణ పోలీస్స్టేషన్ సమీపంలో గల మరో ఎటిఎం కేంద్రానికి వెళ్ళాడు. అక్కడ ఇదే పరిస్థితి. పక్కనే ఉన్న ఇంకో కేంద్రంలో ఉండచ్చేమోననే ఆశతోఅందులోకి వెళ్ళాడు. గబ గబా..తన డెబిట్ కార్డు తీసి అప్లై చేశాడు. కంప్యూటర్ తెరపై నోక్యాష్ ఇన్ దిస్ ఎటిఎం అనే వాక్యం రావటంతోనిరాశతో వెనుదిరిగాడు.