రాష్ట్రీయం

యాంటీ టెర్రరిజం ఫోరం ర్యాలీ నేడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 26: దేశం కోసం అడుగేద్దాం, ఉగ్రవాదాన్ని తరిమేద్దాం అని పిలుపునిస్తూ యాంటి టెర్రరిజం ఫోరం శనివారం సాయంత్రం హైదరాబాద్ రాజీవ్ చౌరాస్తాలో భారీ ర్యాలీ నిర్వహించనుంది. దేశం కోసం నినదిద్దాం- జాతి సార్వభౌమత్వాన్ని ప్రశ్నిస్తే సహించేది లేదని ఫోరం కన్వీనర్ ఆర్ శశిధర్ తెలిపారు. అంతర్జాతీయ కుట్రలో భాగంగా దేశంలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల్లో కొన్ని వామపక్ష విద్యార్ధి సంస్థలు, దేశానికి వ్యతిరేకంగా , ఉగ్రవాదులను సమర్ధిస్తూ భారతదేశాన్ని ముక్కలు చేయాలనే కుట్రలు చేస్తున్నారని అన్నారు. దీనికి నిస్సగ్గుగా కొన్ని రాజకీయ పార్టీలు బహిరంగ మద్దతు తెలుపుతున్నాయని, ఇలాంటి దేశద్రోహ శక్తులను ఆదిలోనే అణచివేయకుంటే భవిష్యత్‌లో భారత్ భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుందని అన్నారు. సైనికులు, పోలీసు బలగాలు నిరంతరం శ్రమిస్తూ దేశాన్ని రక్షిస్తుంటే దేశ సార్వభౌమత్వం పరిరక్షించబడుతోందని, దానివల్ల అంతా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నామని అన్నారు. దిల్‌షుక్‌నగర్ రాజీవ్ చౌరాస్తా నుండి ర్యాలీ సాయంత్రం ఆరుగంటలకు మొదలవుతుందని ఆయన చెప్పారు.