రాష్ట్రీయం

అరసవల్లిలో వైభవంగా రథసప్తమి వేడుకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 14: అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరిగాయి. వేడుకలను విశాఖపట్నం శారదాపీఠం స్వరూపానందేంద్ర సరస్వతి ప్రారంభించారు. మూలవిరాట్‌కు స్వరూపానందేంద్ర స్వామి మహాక్షీరాభిషేకం చేశారు. స్వామివారిని దర్శించుకోవడానికి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆదివారం రాత్రి 12.01 గంటలకే స్వరూపానందేంద్రస్వామి ఆదిత్యుని మూలవిరాట్‌కు మహా క్షీరాభిషేకం చేసి తొలి సంధ్యావేళలో రథసప్తమి మహోత్సవాన్ని ఆరంభించారు.
విఐపీలు, వివిఐపీలు తాకిడి ఎక్కువ కావడంతో సాధారణ భక్తులకు ఇబ్బంది కలిగింది. ఒక దశలో భక్తులు ఆగ్రహించి బారిగేడ్లు దాటుకుని అధికారులు, పోలీసుల మీదకు విరుచుకుపడ్డారు. స్వల్పంగా తొక్కిసలాట జరిగింది. క్యూలైన్లలో భక్తులు విఐపీలు డౌన్..డౌన్ అం టూ నినాదాలు చేశారు.