అదిలాబాద్
జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు లేవు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 22 October 2016
మందమర్రి, అక్టోబర్ 21: మంచిర్యాల జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు లేవని రామగుండం పోలీసు కమిషనర్ విక్రమ్జిత్ దుగ్గల్ అన్నారు. శుక్రవారం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మావోయిస్టు కార్యకలాపాలు తగ్గుముఖం పట్టినా తమ పని తాము చేస్తూపోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో రియల్ దందా కొనసాగించే వారిపై ఉక్కు పాదం మోపుతామన్నారు. బెల్టుషాపులను నిర్వహిస్తే కఠినచర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జిల్లాలో అవినీతిని అరికట్టడంలో పోలీసులు గట్టి చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో మంచిర్యాల డిసిపి జాన్వెస్లీ, బెల్లంపల్లి ఎసిపి రమణారెడ్డితో పాటు మందమర్రి సిఐ సదయ్య తదితరులు పాల్గొన్నారు.