క్రైమ్/లీగల్

ముగ్గురు ఆడపిల్లలను రోడ్డున పడేసిన తల్లిదండ్రులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 3: అభం,శుభం తెలియని చిన్నారులను తల్లిదండ్రులు వారంరోజుల క్రితం పట్టణంలోని పాత క్లబ్ స్కూల్ ఆవరణలో వదిలిపెట్టి వెళ్ళిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ చిన్న పిల్లల ఆలన పాలన మహ్మద్ ఖాసీం బస్తీ ప్రజలు చూస్తు న్నారు. ఈ విషయమై స్థానికులు శిశు రక్షణ శాఖ కేంద్రానికి ఆదివారం సమాచారం అందించారు.
దీంతో చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ మడుపు సత్యనారాయణ తోపాటు సిబ్బంది సూజాత, సుమలతలు మహ్మద్ ఖాసీం బస్తీకి చేరుకుని హిందూ, నందిని, నిత్య అనే ముగ్గురు పిల్లలను కాల్‌టెక్స్ ఏరియాలోని అమ్మ అనాథ శరణాలయానికి పంపించారు. ఈ విషయమై చైల్డ్‌లైన్ జిల్లా కో-ఆర్డినేటర్ మడుపు సత్యనారాయణను వివరణ కోరగా.. బెల్లంపల్లి రడగంబాల బస్తీకి చెందిన వాల్మికి రాజు-రాణి దంపతులు వారం రోజుల క్రితం వారి ముగ్గురు ఆడపిల్లలను పాత క్లబ్ స్కూల్ ఆవరణలో వదిలిపెట్టారని తెలిపారు. స్థానిక ప్రజలు 1098 నంబరు ద్వారా శిశు రక్షణశాఖ వారికి సమాచారం అందించడంతో హెల్ప్‌లైన్ సిబ్బంది సుజాత, సుమలత అనాథ శరణాలయానికి తరలించారు. కాగా, పిల్లల తల్లిదండ్రులకు కౌనె్సలింగ్ నిర్వహిస్తామన్నారు. ఆ పిల్లల తండ్రి రాజు పారిశుద్ధ్య పనులు చేస్తున్నాడని కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా ఉంటున్నాడని సమాధానం ఇచ్చాడు. కాగా, హిందు, నందని, నిత్యల వయస్సు 7, 5, 3 సంవత్సరాలు. ఈ పిల్లల బాగోగులను చూసుకోని పక్షంలో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని చిన్న పిల్లల బాల సదనానికి పంపిస్తామని వారు తెలిపారు.