అదిలాబాద్

కాంగ్రెస్ సంస్థాగత పటిష్టతకు కమిటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, మే 27: రాబోయే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని, సంస్థాగతంగా పార్టీని పటిష్టం చేసేందుకు జూన్ మొదటి వారం నుండి మండల, నియోజకవర్గ, జిల్లా కమిటీలు నియమిస్తామని ఆ పార్టీ జిల్లా నూతన ఇంచార్జి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో జిల్లా కాంగ్రెస్ నేతలతో శుక్రవారం సమావేశమై పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లాలో పార్టీ పునర్వైభవం కోసం పాటుపడాలని, గ్రూపులు లేకుండా పనిచేస్తూ టీఆర్‌ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు పార్టీ కోసం సైనికులుగా పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా పార్టీలో లోటుపాట్లను తరచు చర్చించాలని నేతలకు సూచించారు. పార్టీని పట్టుకోల్పోకుండా కార్యకర్తల్లో మనోధైర్యం నింపాలని, పనిచేసిన నేతలకు సముచిత గుర్తింపు ఇస్తామన్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సి.రాంచంద్రారెడ్డి, డిసిసి ప్రెసిడెంట్ మహేశ్వర్ రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నరేష్ జాదవ్, పట్టణ అధ్యక్షుడు సాజిద్‌ఖాన్ పాల్గొన్నారు.