అదిలాబాద్

29న జడ్పీ స్థాయా సంఘ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 17: ఈనెల 29న జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ స్థాయా సంఘ సమావేశం నిర్వహించడం జరుగుతుందని జడ్పీ సిఈవో జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ వల్లకొండ శోభారాణి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఉదయం 10.30 గంటల నుండి 11.30 వరకు గ్రామీణాభివృద్దిపై చర్చించడం జరుగుతుందని, అదే విధంగా 11.30 నుండి 12.30 గంటల వరకు వ్యవసాయం, మధ్యాహ్నం 12.30 గంటల నుండి 1.30 వరకు విద్యా, వైద్య సేవలపై, 1.30 గంటల నుండి 2.30 గంటల వరకు మహిళా సంక్షేమంపై చర్చించడం జరుగుతుందని, 3 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు సాంఘీక సంక్షేమం, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు ప్రణాళిక, ఆర్థిక, పనుల స్థాయి కమిటీపై చర్చించడం జరుగుతుందన్నారు. సమావేశానికి శాసన మండలి చైర్మెన్ కె.స్వామిగౌడ్‌తో పాటు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి జోగు రామన్న, న్యాయ, గృహనిర్మాణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గెడం నగేష్, ఎమ్మెల్యేలు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశాలకు అధికారులు ప్రగతి నివేదికలతో సకాలంలో హాజరుకావాలన్నారు.