అదిలాబాద్

బాసరకు పోటెత్తుతున్న భక్తులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాసర, ఆగస్టు 4: గోదావరి అంత్యపుష్కరాలు బాసర క్షేత్రంలో వైభవంగా జరుగుతున్నాయి. గురువారం అంత్యపుష్కరాలు 5వ రోజుకు చేరుకున్నాయి. శ్రావణమాసం ప్రారంభం కావడంతో పుణ్యస్నానాలు ఆచరించేందుకు భక్తులు బాసరకు వేలాదిగా తరలివస్తున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గోదావరి ఘాట్లు భక్తజనంతో కిటకిటలాడుతున్నాయి. ఆలయ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో చెత్తాచెదారం దర్శనమిస్తుండడంతో భక్తులు ఇబ్బందుల పాలవుతున్నారు. వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు నదీతీరం వద్ద కొలువైన శివాలయంలో అభిషేక, అర్చన పూజలు నిర్వహించి నదితీరంలో దీపాలను వదులుతున్నారు. భక్తులు, చిన్నారులు అమ్మవారి దర్శన క్యూలైన్‌లో బారులు తీరారు. భక్తులు తమ చిన్నారులకు అమ్మవారికి అక్షరాభ్యాస మండపాల్లో ఆలయ అర్చకులచే ఘనంగా అక్షరస్వీకార పూజలు నిర్వహించారు. శుభముహూర్తాల నేపథ్యంలో అమ్మవారిచెంత శ్రీకార పూజలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది. సుమారు 5వేలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఆర్జిత సేవలు, లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా ఆలయానికి రూ.3 లక్షల ఆదాయం సమకూరినట్లు అధికారులు పేర్కొన్నారు.