అదిలాబాద్
దస్తురాబాద్లో పాకిస్థాన్ ప్రధాని దిష్టిబొమ్మ దగ్ధం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Thursday, 22 September 2016
కడెం, సెప్టెంబర్ 22: ఉగ్రవాదుల దాడిలో అమరులైన భారత సైనికులకు కడెం మండలంలోని దస్తురాబాద్ గ్రామంలో గురువారం యంగ్స్టార్ యూత్ సభ్యులు, భజరంగ్దళ్ యూత్ సభ్యుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున పలు వీధులగుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉగ్రవాదులను ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్ ప్రధానమంత్రి దిష్టిబొమ్మను భజరంగ్దళ్ సభ్యులు దగ్ధంచేశారు. కాశ్మీర్ యూరి సెక్టార్లో దొంగచాటుగా ఉగ్రవాదులు దాడిచేసి 17 మంది భారతసైనికులను హతమార్చడం అనుమాన చర్య అని వారన్నారు. ఉగ్రవాదుల దాడిలో మృతిచెందిన జవాన్ల ఆత్మకు శాంతికలగాలని కోరుతూ యూత్ సభ్యులు రెండు నిమిషాలు వౌనం పాటించి తమ సంతాపాన్ని వ్యక్తంచేశారు. కార్యక్రమంలో భజరంగ్దళ్ యూత్ సభ్యులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.