రాష్ట్రీయం

అమరావతిలో అమిటీ యూనివర్సిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఏపి విద్యారంగంలో మరో మైలురాయి
* విశ్వస్థాయి యూనివర్సిటీలు వస్తే ఆహ్వానిస్తామన్న సిఎం

విజయవాడ, డిసెంబర్ 29: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమిటీ యూనివర్సిటీ తన శాఖను ఏర్పాటుచేయనున్నది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నివాసంలో మంగళవారం ఇక్కడ అమిటీ యూనివర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ అతుల్ చౌహాన్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సిఎంతో భేటీ అయింది. అమరావతిలో తమ శాఖ ఏర్పాటుకు బృందం ఆమోదం తెలిపింది. 2017 నుంచి అమిటీ విశ్వవిద్యాలయం సొంత క్యాంపస్ ఏర్పాటు చేసుకుని అడ్మిషన్లు ప్రారంభించడానికి అంగీకారం తెలియజేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రపంచంలో అత్యుత్తమ విశ్వవిద్యాలయాలు అమరావతిలో శాఖలు ఏర్పాటు చేయాలన్నది తమ అభిమతమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులు ఏ రంగంలోనైనా సరే.. వారికి అత్యుత్తమ, ఉన్నత విలువలతో కూడిన విద్యను అందించే యూనివర్సిటీలు వస్తే స్వాగతిస్తామని, ప్రాంగణాలు ఏర్పాటుచేస్తామని చంద్రబాబు తెలిపారు. అమరావతిలో నాణ్యమైన విద్యనందించే యూనివర్సిటీలు రావటానికి, అత్యుత్తమ నిపుణులు వచ్చి సేవలు అందించేందుకు సహకరించాలని కోరారు. విదేశీ విశ్వవిద్యాలయాల సహకారం తీసుకుని సంయుక్తంగా డిగ్రీ ప్రోగ్రాంలు ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించిన డా.చౌహాన్ మాట్లాడుతూ భరతీయ విద్యార్థులు ఎవ్వరూ ఉన్నత విద్యాభ్యాసానికి విదేశాలకు వెళ్లే పరిస్థితి రాకూడదన్నది తమ అభిమతమని చౌహాన్ తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్య అందించాలన్నది తమ ధ్యేయమన్నారు. పరిశోధనాత్మక విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దిన యూనివర్సిటీ అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ను విద్యాకేంద్రం (నాలెడ్జి హబ్)గా తీర్చిదిద్దటంలో రాష్ట్ర ప్రభుత్వానికి తమ వంతు సహకారం అందిస్తామని ఆయన ముఖ్యమంత్రితో అన్నారు. అమిటీ విశ్వవిద్యాలయం వివిధ రాష్ట్రాల్లో 11 యూనివర్సిటీ శాఖలను నెలకొల్పిందని, 20 క్యాంపస్‌లను, 18 విభాగాల్లో బోధనా విభాగాలను ఏర్పాటు చేసిందని వివరించారు. అమిటీలో అనుభవజ్జులైన ఫ్యాకల్టీ మెంబర్లున్నారని, 60 దేశాల విద్యార్థులు ప్రవేశాలకు దరఖాస్తు చేసుకుంటున్నారని డా.చౌహాన్ తెలిపారు.