క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓబుళదేవరచెరువు, ఏప్రిల్ 30: అనంతపురం జిల్లా ఓడీచెరువు మండల పరిధిలోని డబురువారిపల్లి మిట్ట వద్ద సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుట్టపర్తి మండలం సాదర్లపల్లి గ్రామానికి చెందిన దారా గీత (13), అమడగూరు మండలం మహమ్మదాబాద్‌కు చెందిన ప్రమీల (17)లు మృతి చెందారు. వివరాలిలా వున్నాయి. ఇరువురు బాలికలు మహమ్మదాబాద్ నుండి ప్రజత్ భార్గవ్ అనే వారి బంధువుల అబ్బాయి ద్విచక్ర వాహనంలో మహమ్మదాబాద్ నుండి బయల్దేరి డబురువారిపల్లి మిట్టపై వెళ్తుండగా పక్కనే కంకర తీసుకొని ట్రాక్టర్ వెళ్తోంది. ఇరువురికి సమన్వయలోపం కారణంగా ద్విచక్రవాహనం ట్రాక్టర్ చక్రాల ముందు పడ్డారు. దీంతో గీతా అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన ప్రమీలను మెరుగైన చికిత్స కోసం కదిరికి తరలించారు. మెరుగైన వైద్య సేవలకోసం జిల్లా ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. విషయం తెలుసుకున్న జడ్పీటీసీ పిట్టా ఓబుళరెడ్డి, ఎంపీపీ ఇస్మాయిల్‌లు అక్కడికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కాగా పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథ్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతరం ఫోన్‌లో ఆయన మాట్లాడుతూ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, ఎక్స్‌గ్రేషియా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా శవాలను పోస్టుమార్టం నిమిత్తం కదిరికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రాజశేఖరరెడ్డి తెలిపారు. ప్రమాదానికి కారకుడైన ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తిమృతి
తాడిమర్రి, ఏప్రిల్ 30 : మండల కేంద్రంలోని కునుకుంట్ల గ్రామంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివారెడ్డి (45) మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు కునుకుంట్ల గ్రామానికి చెందిన శివారెడ్డి ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఎదురుగా నిడిగల్లు గ్రామానికి చెందిన గోపాల్ ఆటోలో వస్తూ ఢీకొనడంతో అక్కడికక్కడే శివారెడ్డి మృతి చెందగా ఆటో నడుపుతున్న వ్యక్తి గోపాల్‌కు తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వేణుగోపాల్ తెలిపారు.