ఆంధ్రప్రదేశ్‌

రూ.680 కోట్లు ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 19: కడప, నెల్లూరు, ప్రకాశం, అనంతపురం, విజయనగరం జిల్లాల్లో కరవు నుంచి ఉపశమన చర్యలకు రూ.680 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేంద్ర బృందానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో శాశ్వత ప్రాతిపదికన కరవు నివారణ చర్యలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి అదనపు సాయం అందించాలని కోరారు. కరవును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎన్ని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినా ఒక్కోసారి ప్రకృతి సహకరించకపోవడం వల్ల నష్టపోవాల్సి వస్తోందని చెప్పారు. కరవు పరిస్థితులపై పరిశీలనకు రాష్ట్రానికి వచ్చిన కేంద్ర బృందం రెండురోజులపాటు జిల్లాల పర్యటన అనంతరం గురువారం ముఖ్యమంత్రితో సమావేశమైంది. ఐదు జిల్లాల్లో 121 మండలాల్లో పర్యటించామని వాటిలో ప్రకాశం జిల్లాలో పరిస్థితులు ఒకింత ఆందోళనకరంగా ఉన్నాయని కేంద్ర బృందం సభ్యులు ముఖ్యమంత్రికి తెలిపారు. ప్రకాశం జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటిపోయాయని, తాగునీటి, పశుగ్రాస సమస్యలు కూడా అధికంగా ఉన్న విషయాన్ని గమనించామని చెప్పారు. అదే సమయంలో కరవును ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని మెచ్చుకున్నారు. రేషన్, పెన్షన్లు అందించేందుకు అవలంభిస్తున్న విధానాలు తమనెంతో ఆకట్టుకున్నాయని కరవు మండలాల్లో ఉపాధి హామీ పథకం పనులు జరుగుతున్న తీరు చాలా బాగుందని ముఖ్యమంత్రికి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో కరవు, తుపాన్లు రెండూ ఎదుర్కొనాల్సిన విచిత్ర పరిస్థితులు ఉన్నాయని, కోస్తాంధ్రను తుపాన్లు, రాయలసీమను కరవు పీడిస్తున్నాయని కేంద్ర బృందానికి ముఖ్యమంత్రి వివరించారు. ఎన్ని చర్యలు తీసుకున్నా ఒక్కోసారి ప్రకృతి వైపరీత్యాలను నిలువరించలేని పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పారు. రాయలసీమ ప్రాంతాన్ని కరవు బారి నుంచి కాపాడటానికి విస్తృత చర్యలు చేపట్టామని, పెద్ద సంఖ్యలో పంటకుంటలు తవ్విన విషయాన్ని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంట కుంటల్లో నీటి నిల్వలు చేరలేదన్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి నీటిని కృష్ణాడెల్టాకు తరలించకుంటే చివరికి కృష్ణా, గుంటూరు జిల్లాలు కూడా బీడు వారేవని ముఖ్యమంత్రి అన్నారు. సాధ్యమైనంత త్వరగా వెలగొండ ప్రాజెక్ట్ పూర్తిచేసేందుకు పనిచేస్తున్నామని, టనె్నల్ పనులు పూర్తయితే ప్రకాశం జిల్లాను శాశ్వతంగా కరవు బారి నుంచి కాపాడుకోగలుగుతామని అన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర, ముఖ్య కార్యదర్శి సాయిప్రసాద్, విపత్తు నిర్వహణ శాఖ ఎండి శేషగిరిబాబు పాల్గొన్నారు.

చిత్రం.. ముఖ్యమంత్రితో సమావేశమైన కేంద్ర బృందం