ఆంధ్రప్రదేశ్
చిత్తూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 21న
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Sunday, 22 April 2018
విజయవాడ, ఏప్రిల్ 21: గాలి ముద్దుకృష్ణమనాయుడు మృతితో ఏర్పడిన చిత్తూరు స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే 21న నిర్వహించనున్నారు. ఈ మేరకు ఏపీ ఎన్నికల సంఘం శనివారం షెడ్యూల్ విడుదల చేసింది. ఈనెల 26న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ల దాఖలుకు మే 3వ తేదీ గడువు. నామినేషన్ల పరిశీలన మే 4న, నామినేషన్ల ఉపసంహరణకు మే 7వరకు గడువు. పోలింగ్ మే 21న ఉదయం 8 గంటల సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. ఓట్ల లెక్కింపు మే 24న నిర్వహిస్తారు.