ఆంధ్రప్రదేశ్‌

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం, జూలై 2: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం పెంజండ్ర వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులు దుర్మరణం చెందారు. విజయవాడకు చెందిన సయ్యద్ వౌలాసాహెబ్(19), ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పేల కృష్ణసాయి(19), విజయవాడకు చెందిన షేక్ సాదిక్(20) గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్నారు. ఎప్పటిలాగానే సోమవారం మధ్యాహ్నం కళాశాల వదిలిన తర్వాత ముగ్గురు విద్యార్థులు ఒకే ద్విచక్ర వాహనంపై విజయవాడ వెళుతుండగా ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్ టేక్ చేయబోయి అదుపు తప్పి లారీకింద పడ్డారు. ఈ ప్రమాదంలో వౌలాసాహెబ్, కృష్ణసాయి అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడ్డ సాదిక్‌ని హుటాహుటిన 108 అంబులెన్స్‌లో గుడివాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.