ఆంధ్రప్రదేశ్‌

‘తెలుగు ప్రజలు బీజేపీ పనిపట్టారు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం టౌన్, మే 25: కర్నాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ లిట్మస్ టెస్ట్‌లో గెలిచిందని పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. శుక్రవారం అనంతపురంలోని ఆర్‌డీఓ కార్యాలయం వద్ద ప్రత్యేకహోదాకై జరుగుతున్న దీక్షా శిబిరంలో పాల్గొన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ పనైపోయిందంటున్న వారికి కనువిప్పుగా కర్నాటక ఎన్నికల్లో అధికశాతం ఓట్లు పొంది ప్రజల విశ్వాసం చూరగొన్నామన్నారు. కర్నాటక ఎన్నికల్లో తెలుగు ప్రజలు బీజేపీని చావుదెబ్బకొట్టారన్నారు. తెలుగు ప్రజలు 34 నియోజకవర్గాలలో తమ ఓటును కాంగ్రెస్ లేదా జేడీఎస్‌కు వేశారన్నారు. బీజేపీ వారు ఆడినమాట తప్పారని, వంచించారని, ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారన్నారు. రాహుల్‌గాంధీ త్వరలో రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహిస్తారన్నారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు ఉంటుందాయన్న ప్రశ్న ఊహాజనితమేనన్నారు. అది వన్‌సైడ్ లవ్ అని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రాహుల్‌గాంధీతో చర్చలు జరిపారన్నది వదంతి మాత్రమేనన్నారు.