ఆంధ్రప్రదేశ్‌

బడుగుల పార్టీ టీడీపీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 11: వెనుకబడిన తరగతులు, బడుగు, బలహీన వర్గాల పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి కాలవ శ్రీనివాసులు చెప్పారు. సచివాలయం 4వ బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో సోమవారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల సంక్షేమానికి ఒక డిక్లరేషన్ ప్రకటిస్తానని చెప్పారని, వాస్తవానికి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలోనే బీసీలకు తీరని అన్యాయం జరిగిందన్నారు. ఆయన పాలనలో బీసీల అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. 2008లో 8 ఫెడరేషన్లు ఏర్పాటు చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పారు. 25 కులాలలను బీసీల జాబితాలో చేర్చారని, దామాషా పద్ధతిలో వారికి లబ్ది చేకూర్చలేదన్నారు. వారి పాలనలో బీసీలు అణచివేతకు గురయ్యారని మండిపడ్డారు. టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని, పార్టీకి వారు వెన్నుదన్నుగా ఉన్నారని చెప్పారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని టీడీపీని దెబ్బతీయడానికి ఆనాడు బీసీల అణచివేతకు పూనుకున్నారని విమర్శించారు. ఆనాడు బీసీ విద్యార్థుల ఫీజుల బకాయిలు వేల కోట్లలో పేరుకుపోతే వారు రక్తం అమ్ముకొని ఫీజులు చెల్లించారని చెప్పారు. రాజకీయంగా కూడా వారిని ప్రోత్సహించలేదన్నారు. వారిని దరిదాపులకు కూడా రానివ్వలేదని చెప్పారు. బీసీల సంక్షేమం కోసం తొలి నుంచి టీడీపీ కృషి చేస్తోందన్నారు. కీలకమైన పదవుల్లో బీసీలే ఉన్నారని తెలిపారు. ప్రస్తుత మంత్రివర్గంలో 8 మంది మంత్రులు బీసీలే ఉన్నారని, టీటీడీ చైర్మన్‌గా కూడా బీసీనే నియమించారని వివరించారు. గతంలో కూడా ఎర్రన్నాయుడు, దేవేంద్రగౌడ్, యనమల రామకృష్ణుడు, కేఈ కృష్ణమూర్తి వంటి బీసీలే కీలక పదవులు అలంకరించారని చెప్పారు. అత్యంత వెనుకబడిన గాండ్ల సామాజిక వర్గానికి చెందిన గౌనివాని శ్రీనివాసులుకు టీటీడీ బోర్డు మెంబర్ మరియు శాసనమండలి సభ్యుని చేసిన ఘనత తమ పార్టీదేనన్నారు. జగన్ వెంట కేసుల్లో, రాజకీయాల్లో ఉన్నది ఆయన సామాజిక వారేనని మంత్రి విమర్శించారు. 2014లో ఎంతమంది బీసీలకు టిక్కెట్లు ఇచ్చారో చెప్పాలన్నారు. అనంతపురంలో రెండు లోక్‌సభ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పి చివరికి ఆయన సామాజిక వర్గానికే ఇచ్చారన్నారు. ఆయన కుడి, ఎడమ, ముందు, వెనుక ఉన్నది ఎవరో, మొన్న ఒక్క రాజ్యసభ స్థానం ఎవరికి ఇచ్చారో అందరికి తెలుసన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరపున రాయలసీమలో ఎన్ని సీట్లు బీసీలకు కేటాయించారో చెప్పాలి? ఏ బీసీ నాయకుడినైనా ప్రోత్సహించారా? ఏ బీసీ నాయకుడి భుజం మీదనైనా చేయి వేసి మాట్లాడావా? అని ప్రశ్నించారు. బీసీ సబ్‌ప్లాన్‌ని అమలు చేసింది టీడీపీ అని చెప్పారు. వైఎస్ హయాంలో 5 ఏళ్లలో ఫెడరేషన్లకు రూ.152.27 కోట్లు కేటాయిస్తే, గత నాలుగేళ్లలో రూ.1376 కోట్లు ఖర్చు చేయగా, 2 లక్షల 70 వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. 2004-09 మధ్యకాలంలో ఉపకార వేతనాల ద్వారా 19 లక్షల 49వేల మంది లబ్ది పొందితే, తమ హయాంలో ఈ నాలుగేళ్లలో రూ.2,693 కోట్లు ఖర్చు చేయగా, 36 లక్షల 51వేల మంది లబ్ది పొందినట్లు వివరించారు. అంతేకాకుండా విదేశీ విద్య పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.10 లక్షలు ఇచ్చినట్లు చెప్పారు. ఎంబీసీలకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బీసీల సంక్షేమం, వారి అభివృద్ధి, వారికి రాజకీయ అవకాశాల గురించి జగన్ మాట్లాడకుండా ఉండటమే మంచిదన్నారు. జగన్ రోజుకు 13 కిలోమీటర్లు తలక్రిందలుగా పాదయాత్ర చేసినా బీసీలు ఆయన దగ్గరకు చేరరన్నారు. తెలుగుదేశం పార్టీ ఆనాడు పెట్టకపోతే బీసీలు కనీసం గుర్తింపునకు కూడా నోచుకునేవారు కాదని కాలవ శ్రీనివాసులు వివరించారు.