ఆంధ్రప్రదేశ్
రైల్వేజోన్ కోసం ఎంపీ ముత్తంశెట్టి దీక్ష
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 12 June 2018
అనకాపల్లి, జూన్ 12: విశాఖ కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయడం, విభజన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో విశాఖ జిల్లా అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి మంగళవారం నిరసన దీక్ష చేపట్టారు. ఎప్పటికప్పుడు పార్లమెంట్లోనూ, బయటా తనదైన శైలిలో ఈ డిమాండ్లపై పోరుబాట సాగిస్తున్న టీడీపీ అనకాపల్లి ఎంపీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు మంగళవారం తన జన్మదిన వేడుకలను అందుకు వేదికగా మలచుకున్నారు. ఇక్కడి నెహ్రూచౌక్ జంక్షన్లో కేంద్ర ప్రభుత్వం విభజన హామీల అమలుకు తిలోదకాలిచ్చే చర్యలను నిరశిస్తూ ఆయన చేపట్టిన ఒకరోజు నిరసన దీక్షకు స్పందన లభించింది. ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి, విశాఖ డెయిరీ చైర్మన్ ఆడారి తులసీరావు తదితర నేతలంతా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు.