ఆంధ్రప్రదేశ్‌

కుట్ర రాజకీయాలకు రాష్ట్రాన్ని బలితీసుకుంటారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 14: కుట్ర రాజకీయాలకు రాష్ట్రాన్ని, ప్రజలను బలితీసుకుంటారా? అంటూ వైకాపా, బీజేపీపై రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఉండవల్లిలోని గ్రీవెన్సు హాల్ వద్ద గురువారం రాత్రి మీడియాతో ఆయన మాట్లాడుతూ ఎంపీల రాజీనామాల పేరుతో రాజీడ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ అయిన మోత్కుపల్లితో వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ కావడం కుట్ర కాదా అని ప్రశ్నించారు. వైకాపాలో చేరేందుకు సిద్ధమైన కన్నా లక్ష్మీనారాయణకు ఏమి చెప్పి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి కట్టబెట్టారని ప్రశ్నించారు. బీజేపీలో ఉన్నా, వైకాపాలో ఉన్నా ఒకేటేనని చెప్పి ఒప్పించలేదా? అని ప్రశ్నించారు. టీడీపీ లేకున్నా, వైకాపా ఉందన్న ధైర్యంతో బీజేపీ ఇంత అన్యాయానికి తెగబడిందన్నారు. ఎంపీలు రాజీనామాలు చేస్తారు.. కానీ వాటిని ఆమోదించరన్నారు. ఇది కుట్ర కాదా? అని ప్రశ్నించారు. ప్రజల తరపున పోరాటం అంటూనే కేంద్రాన్ని కానీ, మోదీని కానీ ఒక్కమాట కూడా అనరని, కానీ టీడీపీని తిడతారని ఎద్దేవా చేశారు. 2014లో కాంగ్రెస్‌కు పట్టిన గతే బీజేపీ, వైకాపాలకు పడుతుందని ఆరోపించారు.