ఆంధ్రప్రదేశ్‌

విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు పరిశీలిస్తా: సీఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్15: విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటును పరిశీలిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలో ఐదు ఉపకులాల విశ్వబ్రాహ్మణ సంయుక్త కార్యాచరణ కమిటీ శుక్రవారం సీఎంను కలిసింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. అమరావతిలో విశ్వబ్రాహ్మణ విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని కేటాయించే అంశాన్ని కూడా పరిశీలిస్తానని తెలిపారు. కడపలో ఆగస్టు 26న జరిగే విశ్వబ్రాహ్మణ శంఖారావం సభకు తప్పకుండా వస్తానని తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఆ కమిటీ చైర్మన్ పావులూరి హనుమంతరావు తదితరులు ఉన్నారు.