ఆంధ్రప్రదేశ్
టెన్త్ ఫలితాలపై విచారణకు కమిటీ
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 16 June 2018
విజయవాడ, జూన్ 15: విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఏప్రిల్లో విడుదల చేసిన పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఎక్కువ సంఖ్యలో విద్యార్థులకు 10కి 10 జీపీఏ రావడంపై, రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించడంపై విచారణకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటుచేస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో నెం.135ను విడుదల చేసినట్లు రిజిష్టర్డ్ ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కమిటీ 15 రోజుల్లో అత్యధిక 10/10 జీపీఏ, ఎక్కువ ఉత్తీర్ణత శాతంపై అధ్యయనం చేసి విశే్లషించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.