ఆంధ్రప్రదేశ్‌

చంద్రబాబుపై బీజేపీ, వైసీపీ మహాకుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 16: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిపై బీజేపీ, వైసీపీ మహా కుట్ర పన్నుతున్నాయని, సీఎంపై రాజకీయంగా, భౌతికంగా దాడులు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయని శాసనమండలిలో ప్రభుత్వ విప్ బుద్దా వెంకన్న ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, రాష్ట్రంలో ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ కుట్రకు సూత్రధారులని శనివారం విలేఖరుల సమావేశంలో బుద్దా ఆరోపించారు. గతంలో గోద్రా అల్లర్ల సమయంలో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని తొలగించాలని చంద్రబాబు డిమాండ్ చేసినందుకే ఈ కుట్రలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్‌రెడ్డి కూడా ఈ కుట్రలో భాగస్వామి అయ్యారన్నారు. మోదీని ప్రధాని పీఠం నుండి దించగల శక్తి చంద్రబాబుకే ఉందన్నారు. మోదీ ఒక నియంత, కుటీల రాజకీయాలు, కుట్ర రాజకీయాలకు పెద్ద ఉన్మాది అంటూ వెంకన్న మండిపడ్డారు. దేశంలో మోదీ, అమిత్‌షా ఉన్మాదులుగా వ్యవహరిస్తుంటే, రాష్ట్రంలో జగన్, విజయసాయిరెడ్డి ఉన్మాదులని అన్నారు. పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి రాజ్యాంగానికి విరుద్ధంగా రాష్ట్రంలోని ఫైల్స్‌ను ఢిల్లీకి తీసుకువెళ్తున్నారంటూ ఆరోపించారు. గత నాలుగేళ్లలో ఈ దేశంలో 700 మంది ముస్లింలను మోదీ హత్య చేశారని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ధర్మ పోరాటం చేస్తున్న ముఖ్యమంత్రిపై కుట్ర చేస్తున్నారంటూ ప్రజలందరూ చంద్రబాబుకు బాసటగా నిలవాలంటూ వెంకన్న పిలుపునిచ్చారు.