ఆంధ్రప్రదేశ్‌

వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 30 : రానున్న 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో కలిసి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. శనివారం ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పోరాట యాత్ర అనంతరం ఉభయ కమ్యూనిస్టు పార్టీల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యచరణను రూపొందిస్తామని తెలిపారు. కేంద్రం రాష్ట్ర విభజన బిల్లులో పొందు పరిచిన అంశాలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తూ రాష్ట్రానికి అన్యాయం చేసిందని ధ్వజమెత్తారు.
ఇప్పటి వరకు దళితుల గురించి పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దళితుల కోసం కార్యక్రమాలు చేస్తామనడం శోచనీయమని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఓట్లు, సీట్ల కోసం వారి పై కపట ప్రేమ చూపుతూ దళిత తేజం - తెలుగుదేశం పేరుతో సభలు నిర్వహించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.