ఆంధ్రప్రదేశ్‌

కోస్తాలో తేలికపాటి వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 5: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకూ కోస్తా తీరం మీదుగా అల్పపీడన ద్రోణి స్థిరంగా కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు మంగళవారం రాత్రి తెలిపారు. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాలో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని తెలిపారు. కోస్తా అంతటా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రుతుపవనాలు ఒక మోస్తరుగా కదులుతున్నాయని పేర్కొన్నారు.