ఆంధ్రప్రదేశ్‌

గవర్నర్‌తో నేడు చంద్రబాబు భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 5: గవర్నర్ నరసింహన్ బుధవారం ముఖ్యమంత్రి భేటీ అవనున్నారు. వాస్తవానికి బుధవారం ఉదయం గవర్నర్ విజయవాడకు చేరుకుని, ముఖ్యమంత్రితో సమావేశంకావల్సి ఉంది. అయితే, ముఖ్యమంత్రి పట్టిసీమ ప్రారంభోత్సవానికి వెళుతున్నందున, భేటీని సాయంత్రానికి వాయిదా వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య వివిధ అంశాల్లో విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైకోర్టు వివాదం రోజు రోజుకూ జఠిలమవుతోంది. అలాగే కృష్ణా జలాల పంపిణీ విషయంలో కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కీచులాటకు దిగుతున్నాయి. వీటితోపాటు విభజన చట్టంలో షెడ్యూల్ 9,10లో ఆస్తుల బదలాయింపు, ఆస్తుల బదలాయింపులో ఎపికి అన్యాయం జరుగుతోందని చెపుతోంది. ఇటువంటి అనేక అంశాలు గవర్నర్, ముఖ్యమంత్రి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం గవర్నర్ బుధవారం రాత్రి ఇక్కడే బస చేస్తారు. గురువారం ఆయన ఇక్కడి నుంచి బయల్దేరి తిరుపతి వెళతారు.