ఆంధ్రప్రదేశ్
సెప్టెంబర్ 15 నాటికి కుప్పానికి హంద్రీ-నీవా నీరు
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 11 August 2018
విజయవాడ, ఆగస్టు 10: హంద్రీ-నీవా ప్రాజెక్టు పనులను సెప్టెంబర్ 15 నాటికి పూర్తి చేసి, కుప్పం నియోజకవర్గానికి నీళ్లు ఇవ్వాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో కుప్పం నియోజకవర్గ అభివృద్ధి పనులపై చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న సహా ఇతర ఉన్నతాధికారులతో శుక్రవారం సీఎం సమీక్షించారు. కుప్పం నియోజకవర్గంలో ప్రారంభించిన పనులను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ రోడ్లను త్వరగా పూర్తి చేయాలన్నారు.