ఆంధ్రప్రదేశ్‌

‘రాష్ట్రాన్ని గాలికొదిలి శవ రాజకీయాలా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడేపల్లిగూడెం, ఆగస్టు 21: వరదలతో వేలాది ఎకరాలు ముంపు బారిన పడి రైతులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్న రాష్ట్రాన్ని గాలికొదిలేసి శవ రాజకీయాలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లాలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో మంగళవారం ఆయన మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో కలిసి పర్యిటించారు. అనంతరం తాడేపల్లిగూడెంలో విలేఖరులతో మాట్లాడుతూ జిల్లాలో ఎర్ర కాలువ వరదతో 20 వేల ఎకరాలు ముంపునకు గురైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతానికి రాకపోవడం, రైతులను పరామర్శించకపోవడం దారుణమన్నారు.