ఆంధ్రప్రదేశ్‌

జీజీహెచ్‌లో రోగి గొంతు కోసిన దుండగుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (అరండల్‌పేట), సెప్టెంబర్ 20: వాళ్లిద్దరూ మద్యానికి బానిసలు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ స్నేహితులయ్యారు. ఈ క్రమంలో ఇద్దరికీ మాటామాటా పెరిగింది. ఈసందర్భంలో విచక్షణ కోల్పోయిన ఒక మందుబాబు కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో మందుబాబు గొంతు కోశాడు. ఆపరేషన్లకు ఉపయోగించే సర్జికల్ బ్లేడ్‌తో దాడికి తెగబడ్డాడు. అయితే గాయపడిన బాధితుడు ప్రాణపాయం నుంచి తప్పించుకున్నాడు. నల్లపాడు హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన షేక్ ఘన్‌సైదా మోకీలు పగలడంతో ఆసుపత్రిలోని 113వ వార్డులో నెలరోజులుగా చికిత్స పొందుతున్నాడు. అతనికి సహాయంగా కుమారుడు షేక్ హుస్సేన్ ఉంటున్నాడు. ఈ క్రమంలో అదే వార్డులో తన బెడ్ పక్కన నగరంలోని జన్మభూమి కాలనీకి చెందిన ఖాజావలి రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్నాడు. ఇద్దరికీ మద్యం అలవాటు ఉండటంతో ప్రతిరోజూ తెప్పించుకొని తాగుతున్నారు. గురువారం మద్నాహ్నం ఘన్‌సైదాకు, కుమారుడు హుస్సేన్‌కు మధ్య ఆస్తి వివాదంలో వాదులాట జరిగింది. హుస్సేన్ తన తండ్రిపై దాడి చేస్తుండగా పక్కనున్న ఖాజావలి అడ్డుకోబోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్ తన పక్కనున్న సర్జికల్ బ్లేడ్‌తో ఖాజావలి మెడ కింది భాగంలో గాయపర్చి అక్కడి నుంచి పరారయ్యాడు. ఖాజావలిని వెంటనే అత్యవసర విభాగానికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు.